మహర్షి ఫిగర్లపై ఫీలర్లు

మహర్షి సినిమా బిజినెస్ పూర్తయింది. ఏకంగా రూ. 140కోట్ల ప్రీ-రిలీజ్ చేసిందని చిత్రబృందం చెబుతోంది. ఐతే, ఇందులో కొత్త వరకే నిజమని సమాచారమ్. మహర్షి సినిమా బిజినెస్ ప్రాధమికంగా పూర్తయింది. ఒక్క ఓవర్ సీస్ మాత్రమే అగ్రిమెంట్లు అయ్యాయి. మిగతా ఏరియాలు మాటలే తప్ప, అగ్రిమెంట్లు ఇంకా కాలేదు.

‘భరత్ అనే నేను’ కన్నా ‘మహర్షి’ తగ్గలేదు. ఇంకా సూపర్ గా వుందని చెప్పడానికి మాత్రమే మహర్షి ఫిగర్లపై ఫీలర్లు వదులుతున్నట్టు తెలుస్తోంది. భరత్ అనే నేను వసూళ్లను బట్టి మహర్షి ఇస్తున్నారు. బయ్యర్లు మాత్రం ఓ కోటి అటు ఇటుగా అడుతున్నారు. బేరం తెగాల్సివుంది.

సీడెడ్ భరత్ అనే నేను 12.6 కు ఇచ్చారు. ఇప్పుడు మహర్షి 12 అడుగుతున్నారు. బయ్యర్ శొభన్ 11 కు అడుగుతున్నట్లు బోగట్టా. ఎందుకంటే భరత్ అనే నేను 10 దగ్గర ఆగిపోయి రెండు కోట్లు నష్టం వచ్చింది. ఇక నైజాం 22 కోట్లు అని ఫీలర్ వదులుతున్నారు. కానీ నిర్మాత దిల్ రాజు 17 నుంచి 18 కోట్ల రేషియోతో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ దిల్ రాజు భరత్ లెక్కలనే సరిచూసుకొంటున్నాడు. మొత్తంగా.. మహర్షి లెక్కలు ఇంకా తేలాల్సివుంది.