నిఖిల్ కోసం రంగంలోకి చంద్రబాబు

హీరో నిఖిల్ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మాండ్యా లోక్ సభ జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ హీరోయిన్ సుమలత నుంచి నిఖిల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలో నిఖిల్ తరుపున ఎన్నికల ప్రచారం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని రంగంలోకి దింపుతున్నారు. ఇవాళ నుంచి చంద్రబాబు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కుమారస్వామీ, నిఖిల్ తో కలిసి మాడ్యా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

సుమలత కోసం సినీ స్టార్స్ రంగంలోకి దిగారు. నటులు దర్శన్, యాష్ ప్రచారం చేశారు. వారి ప్రచార సభలకు పెద్ద యెత్తున ప్రజలు రావడం కుమారస్వామిని కలవరపెడుతోంది. మాండ్యాలో సుమలత విజయం సాధిస్తుందనే అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కుమారస్వామి నిఖిల్ ని గెలిపించే బాధ్యతని చంద్రబాబుపై పెట్టినట్టు తెలుస్తోంది. మరీ.. నిఖిల్ ని చంద్రబాబు గెలిస్తాడా ? లేదా.. ?? అన్నది చూడాలి.