సాయి పల్లవి కమర్షియల్.. కాదు !

హీరోయిన్స్ పక్కా కమర్షియల్. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలనే టైపులో ఉంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రం ఇందుకు భిన్నం. పైసల కోసం ఏ పని పడితే ఆ పని చేయరు. సాయి పల్లవి ఈ టైపే. ఆమె ఒక్క వాణిజ్య ప్రకటనలోనూ నటించలేదు.
ఆహ్వానిస్తే సామాజిక కార్యక్రమాలకు వెళ్తుంది. కానీ, ఒక్క పైసా తీసుకోదు. అది కూడా మేకప్ లేకుండా కార్యక్రమానికి హారవుతుంది.

ఈ మధ్య సాయిపల్లవి ఓ పెద్ద డీల్‌ను కాదని వార్తల్లో నిలిచింది. ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ తమ ఫేస్‌ క్రీమ్‌కు ప్రచారకర్తగా ఉండమని ఆమెను కోరినట్లు సమాచారం. దీనికి పారితోషికంగా రూ.2 కోట్లు ఇస్తామని కూడా సంస్థ పేర్కొందట. కానీ ఆమె నో చెప్పినట్లు తెలిసింది. తనే మేకప్‌ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నానని, అలాంటిది ఫేస్‌ క్రీమ్‌ వాడమని ఎలా ప్రోత్సహించాలని
అడిగిందట. దీంతో మేకప్‌ లేకుండా అలానే ప్రకటనలో నటించమని కోరినా.. ఆమె తిరస్కరించినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం సాయిపల్లవి సూర్యకు జోడీగా ‘ఎన్జీకే’, రానాతో కలిసి ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తున్నారు. శర్వానంద్ – సాయి పల్లవి జోడిగా నటించిన ‘పడి పడి లేచె మనసు’ మంచి సినిమా అనిపించుకొన్నా. కమర్షియల్ గా ఆడలేదు. దీంతో ఈ సినిమా కోసం తీసుకొన్న పారితోషికాన్ని సాయి పల్లవి తిరిగి ఇచ్చేందుకు సిధ్దమైంది. ఐతే, నిర్మాత వద్దని చెప్పారట. ఆ మొత్తాన్ని తదుపరి సినిమా కోసం అడ్వాన్సుగా ఉంచుకోమని చెప్పారట.