టబు కోసం కష్టపడిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ టబు వెంట అదే పనిగా పడ్డాడట. ఆమెని మొదటిసారి ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా కోసం ట్రై చేశాడు. కానీ కుదరలేదు. ఇప్పుడు బన్నీ సినిమాకోసం టబుని ఒప్పించాడు. ఇందుకోసం త్రివిక్రమ్ బాగానే కష్టపడినట్టు తెలిసింది. సినిమా లైన్ అనుకొన్న టైంలోని త్రివిక్రమ్ బన్నీ కలిశాడట. ఆమె నుంచి నో అనే సమాధానం వచ్చిందట. అయినా త్రివిక్రమ్ నిరాశపడలేదు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత మరోసారి వెళ్లి టబుకు కథ వినిపించాడట. కథ విన్న వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఈ నెల 24 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. యువ హీరోలు సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా నాన్న సెంటిమెంట్ తో తెరకెక్కనుందని చెప్పుకొంటున్నారు. ‘నాన్న నేను’ టైటిల్ ప్రచారంలో ఉంది. థమన్ సంగీతం. గీతా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.