రాయుడు షాకింగ్ రియాక్షన్

ప్రపంచకప్‌ ఆడబోయే భారత జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కని సంగతి తెలిసిందే. రాయుడుకి అన్యాయం జరిగిందనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. ఐతే, రాయుడు మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘ప్రపంచకప్‌ మ్యాచ్‌లు చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లజోళ్లు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాను’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశాడు.

టీమిండియా తరఫున మంచి సగటు కలిగి ఉన్న ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. దీనిపై బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇస్తూ.. విజయ్‌శంకర్‌ త్రీడైమెన్షన్‌లో సేవలు అందిస్తాడని అందుకే విజయ్‌ను ఎంపిక చేశామని అన్నాడు. దానికి బదులుగా స్పందించిన రాయుడు ఈసారి ప్రపంచకప్‌ను త్రీడీ కళ్లద్దాలతో చూస్తానంటూ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రం విసిరాడు. రాయుడు ట్విట్ లో తెలుగోడి వెటకారం కనిపిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.