చంద్రబాబు.. మీరు సీఎం కాదు !

ఏపీ సీఎం చంద్రబాబుకు ఈసీ మరోసారి షాక్ ఇచ్చింది. సీఎంగా చంద్రబాబు నిర్వహిస్తున్న వరుస సమీక్షలని ఈసీ తప్పు పట్టింది. ఎన్నికలు ముగియగానే సీఎం చంద్రబాబు పనిలో పడ్డారు. పలు శాఖలపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు పనుల పురుగోతిపై సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్య ఇతర సమస్యలపై ఆయన సమీక్ష చేశారు. దీనిపై వైకాపా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయనకి పలు శాఖలపై సమీక్షలు నిర్వహించే అధికారం లేదని వైకాపా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించింది. సమీక్షలు, వీడియో కాన్పరెన్స్‌లు నిర్వహించడం కూడ ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులు ఏం చేయాలనే విషయమై మరోసారి అధికారులకు గైడ్‌లైన్స్‌ను ఈసీ పంపింది. ఈ నేపథ్యంలో గురువారం హోం శాఖపై చంద్రబాబు నిర్వహించాల్సిన సమీక్షరద్దయింది. మొత్తానికి.. ఇప్పుడు మీరు సీఎం కాదని ఈసీ చంద్రబాబుకి గుర్తు చేసినట్టయింది.