కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేసీఆర్’కు గుడికడతాడట.. !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’కు బద్ద శత్రువులా అనిపించే వ్యక్తుల్లో జగ్గారెడ్డి ఒకరు. చాన్నాళ్ల నుంచి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఐతే, ఈ మధ్య జగ్గారెడ్డి స్వరం మారింది. మునుపటిలా కేసీఆర్ పై నోరు పారేసుకోనని స్వయంగా ఆయనే ప్రకటించాడు. ఓ సమయంలో ఆయన కారెక్కెతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ, కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాడు.

తాజాగా జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కి ఓ సవాల్ విసిరాడు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర కల్పిస్తే ఏడాదిలోగా కేసీఆర్ కు గుడికడతానంటూ ప్రకటించారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రైతుకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు.. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సైతం జగ్గారెడ్డి గుడికడతాడట. ఎందుకంటే.. వాళ్లు తెలంగాణ ఇచ్చారని చెబుతున్నాడు. మొత్తంగా గుడి పేరుమీద జగ్గారెడ్డి పెద్ద రాజకీయమే చేస్తున్నట్టుండు.