మహర్షి డ్యూయెట్.. రెడీగా ఉండండీ.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే రెండు పాటలని విడుదల చేశారు. ఐతే, అవి మహేష్ ఫ్యాన్స్ కి పెద్దగా కిక్కునివ్వలేదు. రెండో పాట విషయంలో నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయ్. దీంతో మహేష్ అభిమానులకి కిక్కునిచ్చే పాటని విడుదల చేయనున్నారు.

మహర్షి నుంచి ఫస్ట్ డ్యూయెట్ #EverestAnchunaకి ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 4:05గంటలకి మహర్షి డ్యూయెట్ ని వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేసించి చిత్రబృందం. ఇందులో మహేష్-పూజా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఇక, మహర్షి పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గాట్టునే రూ. 140కోట్ల ప్రీ రిలీజ్ జరిగినట్టు చిత్రబృందం చెబుతోంది. సినిమా బడ్జెట్ దాదాపు రూ. 100కోట్ల వరకు ఖర్చయినట్టు చెబుతున్నారు. మరీ.. వందకోట్ల మహర్షి ఎన్ని లాభాలు తీసుకొస్తుందన్నది చూడాలి.