కారు ప్రమాదంలో.. మురళీ మోహన్‌ కోడలకు గాయాలు !

ప్రముఖ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్’కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వసుమతి దేవి గురువారం కన్నుమూశారు. ఆమెకు నిండు నిరేళ్లు. కొన్ని రోజులుగా వసుమతి ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఆమెని విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. క్రమంగా ఆరోగ్యం కుదుటపడినట్టు అనిపించినా… గురువారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షిణించి మృతి చెందారు.

వసుమతి మరణవార్తతో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరిన మురళీ మోహన్ కోడలు, రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూపాదేవి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రూపాదేవి, ఆమె కూతురికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు.