మహర్షిలో నరేష్ సస్పెన్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డె హీరోయిన్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, అప్పుడే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లీకైంది. సినిమాలో అల్లరి నరేష్ మహేష్ బాబు స్నేహితుడిగా నటిస్తున్నారు. నరేష్ పాత్ర చనిపోవడంతో సినిమా ఫస్టాఫ్ ముగుస్తుందట. ఆ తర్వాత రైతుల కోసం మహేష్ చేసే పోరాటాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తున్నాయని చెబుతున్నారు.

మరోవైపు, సినిమాలో నరేష్ పాత్ర చనిపోదని చెప్పుకొంటున్నారు. ఈ మేరకు నరేష్ తన స్నేహితులకి చెప్పినట్టు తెలుస్తోంది. ముందుగా నరేష్ చనిపోయినట్టు చూపించి.. క్లైమాక్స్ లో సినిమాటిక్ సన్నివేశంతో ఆయన బతికే ఉన్నట్టు చూపిస్తారేమోననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి.. మహర్షిలో నరేష్ పాత్ర చనిపోవడం, బతకడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.