కలర్ స్వాతితో నిఖిల్ మరోసారి !

కలర్ స్వాతి-నిఖిల్ లది హిట్ పెయిర్. వీరి కలయికలో వచ్చిన స్వామి రారా, కార్తీకేయ చిత్రాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇక, కార్తీకేయ సీక్వెల్ పై చాన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ సీక్వెల్ ఓకే అయ్యింది. చందూ మోండేటి స్క్రిప్ట్ రెడీ చేశాడు. సీక్వెల్ లోనూ నిఖిల్-కలర్ స్వాతి జంటగా నటించనున్నారు. ఇందులో మరో హీరోయిన్ ని కూడా కనిపించనుంది.

కార్తికేయ చిత్రం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండి మరలా కథను మొదలు పెట్టి కొత్తగా కథను ప్రెజెంట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరోవైపు, కలర్ స్వాతి బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.