గవర్నర్’ని కలిసిన కోడెల

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ శనివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు సభ సజావుగా నడపడానికి పలు సలహాలు, సూచనలు చేసిన గవర్నర్‌కి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు, ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష, సమావేశాలపై ఈసీ ఆంక్షలు విధించిన అంశాలు గవర్నర్-స్వీకర్ ల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు కావలసిన భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని కోడెల అన్నారు.

ఎన్నికల పోలింగ్ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై దాడి జరగడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, పోలింగ్ బూతులు కోడెల ఎక్కువ సేపు గడపడంపై వైకాపా నేతలు విమర్శలు చేశారు. అసలు గొడవ మొదలుకావడానికి అదే కారణమని వైకాపా నేతల వాదన.