తేజు సక్సెస్ పాఠాలు


చిత్రలహరి చిత్రం హీరో సాయిధరమ్ తేజ్ కి సక్సెస్ తెచ్చిపెట్టింది. వరుసగా ఆరు ప్లాపులని చవిచూసిన తేజుని చిత్రలహరి నిలబెట్టింది. అంతేకాదు.. సక్సెస్ కోసం ఏం చేయాలన్నది నేర్పించింది. ఇన్నాళ్లు ప్లాపులతో నిరూత్సాహపడిన తేజు.. ఇప్పుడు ఏకంగా సక్సెస్ పాఠాలే చెబుతున్నారు.

చిత్రలహరి సక్సెస్ మీట్ లో తేజు మాట్లాడుతూ.. ” సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే అసలైన సక్సెస్. చిత్రలహరి ప్రేక్షకులకి కనెక్ట్ అయింది. ఈ సక్సెస్ నా ఒక్కడి కాదు. చిత్రబృందం మొత్తానిది. కలల కోసం ఫైట్ చేయండి. ఇది జరగదు అని ఎంత చెప్పినా వినకండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. పోరాడండి.. కచ్చితంగా సక్సెస్ దక్కుతుంది” అన్నారు తేజు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి తెరకెక్కింది. కళ్యాణి ప్రియదర్శిని, నివేతా పేతురాజు హీరోయిన్స్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది.