ఐపీఎల్ : ముంబైపై రాజస్థాన్ గెలుపు

కొత్త కెప్టెన్ స్మిత్ సారధ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి విజయాన్ని అందుకొంది. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ సులభంగా గెలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. డికాక్‌(65, 47 బంతుల్లో 6×4, 2×6), సూర్యకుమార్‌ యాదవ్‌(34, 33 బంతుల్లో 1×4, 1×6) రాణించారు.

స్టీవ్‌స్మిత్‌ (59, 48 బంతుల్లో 5×4, 1×6), సంజుశాంసన్‌(35, 19 బంతుల్లో 6X4,1×4), రియాన్‌ పరాగ్‌ (43, 29 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో 162 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఈజీగా చేధించింది. ఈ మ్యాచ్ లో రహానే స్థానంలో స్మిత్ కెప్టెన్ బాధ్యతలని నిర్వహించారు. మే 1 వరకు కూడా స్మిత్ సారధ్యంలోనే రాజస్థాన్ ఆడనుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్ లోని కీలక ఆటగాళ్లు స్మిత్, స్ట్రోక్స్, బట్లర్.. స్వదేశానికి వెళ్లనున్నారు.