ఉప్సీ.. చాలా గర్వంగా ఉంది : చరణ్

శనివారం ముంబయిలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ట్విట్ చేశారు.

‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్‌ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అని ఉపాసన రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఉపాసన అవార్డు పట్టుకున్న ఫొటోను చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘డియరెస్ట్‌ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్‌’ అని పేర్కొన్నారు.