రూ. 500కోట్ల బడ్జెట్’తో త్రివిక్రమ్ సినిమా !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేశాడు. చాన్నాళ్ల క్రిందటే త్రివిక్రమ్ ఈ కథని రాసుకొన్నాడట. అప్పట్లోనే ఆ సినిమా తీయడానికి రూ. 500కోట్ల బడ్జెట్ అవసరం అయ్యేది. ఇప్పుడు తీస్తే మాత్రం రూ. 2000కోట్ల బడ్జెట్ అవుతుందట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్నేహితుడు సునీల్ తెలిపారు. వీరిద్దరు రూమేట్స్ అన్న సంగతి తెలిసిందే.

ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ స్నేహితుడు త్రివిక్రమ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. త్రివిక్రమ్ ఇంకా
తను చాలా తక్కువ స్టేజీలో ఆగిపోయాడు. నాకు తెలిసి తను ఇంకా ఎత్తులో ఉంటాడనుకున్నా. తెలుగులో మహా చేస్తే రెండు సినిమాలు చేస్తాడనుకునేవాడ్ని. ఆ తరవాత బాలీవుడ్‌లోనే చూస్తాడు అనుకునేవాడ్ని. తను అప్పట్లో నాకు చెప్పిన కథలు అలాంటివి. ఓరోజు కూర్చోబెట్టి 500 కోట్ల బడ్జెట్‌ కథొకటి చెప్పాడు. ఇప్పట్లో తీయాలంటే రెండువేల కోట్లు అవుతాయేమో అన్నారు.

అణుబాంబు గురించి ఆటోరిక్షావాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలడు త్రివిక్రమ్. ఎంత సీరియస్‌ మేటర్‌లో ఉన్నా, వాతావరణాన్ని తేలిక చేసేస్తుంటాడు. తనతో కంపెనీ చాలా ఇష్టపడేవాడ్ని. భీమవరం నుంచి వచ్చేటప్పుడు నా బైక్‌ అమ్మేసి వచ్చాను. ఆ డబ్బులు ఇద్దరం ఖర్చు పెట్టుకున్నాం. అది గుర్తుపెట్టుకుని, నాకో బండి కొనిపెట్టాడు. ఐదేళ్ల పాటు ఆ బండిపైనే తిరిగానని చెప్పాడు సునీల్.