హీరోయిన్ యెద సంపదపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్

‘సూపర్’ హీరోయిన్ అయేషా టకియా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. 2009లో ఫర్హాన్ అజ్మీని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైంది. ఐతే, అయేషాపై కెమెడియన్ వరుణ్ గ్రోవర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె యెద సంపద గురించి అసభ్యకరంగా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏడేళ్ల క్రితం అయేషాపై వరుణ్ గ్రోవర్ చేసిన కామెంట్స్ ఇవి. ఇప్పుడీ వీడియోని దర్శకుడు అశోక్ పండిట్ తాజాగా షేర్ చేశారు.

ఈ వీడియోని అశోక్ పండిట్.. స్వర భాస్కర్, రిచా చద్దా, షబానా అజ్మీ లాంటి సెలెబ్రిటీలకు షేర్ చేశాడు. వారిపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో అయేషాపై వరుణ్ గ్రోవర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల వీరంతా ఎందుకు సైలైంట్ గా ఉన్నారని ప్రశ్నించాడు. గ్రోవర్ వ్యాఖ్యలు మహిళలని కించపరిచే విధంగా ఉన్నాయి. అయినా.. ఎవరూ స్పందించలేదని అశోక్ పండిట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకీ.. వరుణ్ గ్రోవర్ ఏమన్నాడంటే.. ? “అమితాబ్ బచ్చన్ ప్రతి చిత్రంలో నటిస్తున్నారు. ఏ సినిమాలో చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని అయేషా టకియా యద సంపదతో పోల్చుతూ వరుణ్ గ్రోవర్ వల్గర్ గా మాట్లాడాడు”. ఇప్పుడీ వీడియోని చూసి నెటిజన్స్ వరుణ్ గ్రోవర్ పై మండిపడుతున్నారు. ‘అతడొక థర్డ్ గ్రేడ్ కమెడియన్’, ‘గోవర్ ది చీప్ మెంటాలిటీ’, అయేష్ భర్త, మామ ఎవరో గోవరకి తెలియనట్టుంది. అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ, మామగారు అబు అజ్మీ చాలా దూకుడైన పొలిటీషియన్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.