ఇంటర్ వ్యవహారంలో ముగ్గురు తెరాస నేతల హస్తం !


తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో ముగ్గురు తెరాస నేతల హస్తం ఉందని ఆరోపించారు టీజెఎస్ అధినేత కోదండరామ్. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ విద్యార్థుల డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం లేదు. విద్యాసంవత్సరం ఆరంభం నుంచే అన్నీ తప్పిదాలే చేస్తోంది.
గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనక ముగ్గురు తెరాస నేతల హస్తం ఉందని కోదండ రామ్ ఆరోపించారు. వీరు గ్లోబరీనా సంస్థపై ఈగ వాలనీయడం లేదన్నారు.

గ్లోబరినాపై చర్యలు తీసుకోవాలి. ఆ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. బోర్డు తీరుపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు. ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో తప్పెవరిదో బయటపడకుండా.. ఫెయిలయిన విద్యార్థుల పేపర్లు రీవెరీపికేషన్ చేసి సమస్యను సద్దుమణిగేలా చేయాలనుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.