ప్రపంచకప్ సెమీస్’లో ఆ నాలుగు జట్లు !


క్రికెట్ ప్రేమికులు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత దీన్ని మించిన పండగ రాబోతుంది. ప్రపంచకప్ ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలపై విస్తృత చర్చ జరుగుతోంది. భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ కచ్చితంగా ప్రపంచ సెమీస్‌ చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ సారధి సౌరవ్‌ గంగూలీ.

రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరుగుతున్న మెగా టోర్నీలో పోటీ తీవ్రంగా ఉంటుందని దాదా అన్నారు. టీమిండియా చాలా బలంగా ఉంది. అత్యుత్తమంగా నిలిచిన నాలుగు జట్లే సెమీస్‌ చేరతాయి. ఆ అవకాశం భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లకి ఎక్కువగా ఉంది. కుల్‌దీప్‌ గురించి బాధపడకండి. అతడు అద్భుతమైన బౌలర్‌. ఇంగ్లాండ్‌లో కచ్చితంగా వికెట్లు తీస్తాడని గంగూలీ అన్నారు.