మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది. నారాయణ్‌పేట్‌ జిల్లా ధన్వాడ మండలంలోని కొండ్రోన్‌పల్లి గ్రామానికి చెందిన శిరీష(17) అనే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది.

శిరీష మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వచ్చిన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో జువాలజీ సబ్జెక్టులో ఆమె ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఇంటి పైపోర్షన్‌లోని గదికి వెళ్లి కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కిందికి దూకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.

కాస్త లేటైనా.. ఇంటర్ బోర్డ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఫెయిలైన విద్యార్థుల పేపర్లని పున:పరిశీలించాలని ఇంటర్ బోర్డ్ ని ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కూడా ప్రకటన చేసింది. అయినా.. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగకపోవడం కలవరపెడుతోంది.