టాలీవుడ్’పై అవెంజర్స్ ఎఫెక్ట్.. గట్టిగానే !

హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఎఫెక్ట్ సౌత్ సినిమాలపై గట్టిగానే పడింది. అవెంజర్స్ రాకతో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు సైడ్ పోతున్నాయి. మే1న విడుదల కావాల్సిన నిఖిల్ ‘అర్జున్ సురవరం’ వాయిదాపడింది. మే9న మహేష్ ‘మహర్షి’ విడుదల కానుంది. ఆ తర్వాత ‘అర్జున్ సురవరం’ విడుదల ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మే1న రావాల్సిన తమిళ చిత్రం ‘అభినేత్రి2’ కూడా వాయిదాపడింది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ భాక్సాఫీస్ దగ్గర అవెంజర్స్ హవా చూపిస్తోంది. ఆ ఎఫెక్ట్ అభినేత్రి2పై గట్టిగానే పడుతుందని భావించిన చిత్రబృందం వాయిదా వేసింది. మే31 రెండో అభినేత్రిని విడుదల చేయనున్నారు. ఇక, మే 31న బాక్సాఫీస్ దగ్గర గట్టిపోటీ ఉంది. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’, సూర్య ‘ఎన్జీకె’, తమిళ్ స్టార్ విక్రమ్ సినిమా కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.