బాలయ్య సేఫ్ గేమ్

నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ప్రయోగాలు చేద్దామని భావించారట. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కథాబలం ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని అనుకొన్నాడట. ఎన్టీఆర్ బయోపిక్ ఘోరంగా నిరాశపరచడంతో.. ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పట్లో ప్రయోగాలు వద్దు. ఎప్పటిలా ఫైట్‌, సాంగ్‌, పంచ్‌ డైలాగ్‌ థీమ్‌లోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ‘జై సింహా’ లాంటి నాసి రకం సినిమా తీసిన కె.ఎస్‌. రవికుమార్‌తో మరో చిత్రం చేయడానికి బాలయ్య అంగీకరించారు. ఎలాంటి కొత్తదనం లేని ‘జై సింహా’ చిత్రం సంక్రాంతికి విడుదలయి సాధించిన వసూళ్లని ‘ఎన్టీఆర్‌’ రెండు భాగాలుగా వచ్చి కూడా సాధించలేకపోవడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య తదుపరి సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉండనుంది. ఆ తర్వాత రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనుందని తెలుస్తోంది.