ఓ మహిళని చంపేసిన హీరో నిర్లక్ష్యం

యువ కథానాయకుడు సుధాకర్‌ కారు మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్‌ గాయపడ్డారు. ఈ ప్రమాదం సుధాకర్ నిర్లక్ష్యం వలనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్‌.. తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. .