విడాకులపై సీఎం భార్య రియాక్షన్

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ పై గృహహింస ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన భార్యని వేధిస్తున్నాడు.
గృహహింసకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిప్లవ్ దేవ్ భార్య నితి దేవ్ విడాకులు కోరుకుంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ప్రచారంపై నితి దేవ్ స్పందించారు.

‘గత 15రోజుల నుంచి నేను మా ఇంటికి దూరంగా ఉంటున్నా. విడాకుల వార్త విని షాక్ అయ్యా. కావాలనే పుకార్లని పుట్టించి ప్రచారం చేస్తున్నారు. విడాకుల విషయం తెలిస్తే.. నా పిల్లల ఎలా రియాక్ట్ అవుతారని బాధపడ్డా. రాష్ట్రాభివృద్ది కోసం బిప్లవ్ దేవ్ కష్టపడుతున్నారు. ఐతే, కొంతమంది మాత్రం పనిగట్టుకొని తన భర్తను వేధింపులకు గురిచేస్తున్నారు” అని మండిపడ్డారు నితి దేవ్.