డీఎస్సీ పరీక్ష వాయిదా


ఏపీ స్పెషల్ డీఎస్సీ పరీక్ష వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులకు వయోపరిమితిలో ఇటీవల సడలింపునిచ్చారు. 54ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇవ్వాల్సి వస్తున్నందున పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

మొత్తం 602 ఉపాధ్యాయ పోస్టులతో స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 15న పరీక్ష నిర్వహించాల్సి ఉంది. నోటిఫికేషన్ లో వయోపరిమితిని 44 యేళ్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని 54యేళ్ల వరకు సడలించారు. ఈ నేపథ్యంలో మే 15న జరగాల్సిన స్పెషల్ డీఎస్సీ వాయిదాపడే అవకాశాలున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.