రాజస్థాన్ గెలిచింది.. నిలిచింది !

రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో ఆ జట్టు మెరుగైన రన్‌రేట్‌తో మిగితా అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్‌ కు చేరుకోవచ్చు.

మొదటి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. మనీష్‌ పాండే (61; 36 బంతుల్లో 9×4) మెరిసినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం అయ్యారు. ఉనద్కత్‌ (2/26), థామస్‌ (2/28), శ్రేయస్‌ గోపాల్‌ (2/30) సన్‌రైజర్స్‌కు కళ్లెం వేశారు. సంజు శాంసన్‌ (48 నాటౌట్‌; 32 బంతుల్లో 4×4, 1×6), లివింగ్‌స్టోన్‌ (44; 26 బంతుల్లో 4×4, 3×6) మెరవడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.