అవెంజర్స్ థియేటర్’లో అపశృతి

హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8381కోట్లు (1.2బిలియన్ డాలర్లు) వసూలు చేసింది. త్వరలోనే 2బిలియన్ డాలర్ల మార్కుని అందుకోనుంది. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు, పాత్రల వీడ్కోలు సీన్లు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చైనాలో ఓ యువతి సినిమా చూస్తూ గుక్కబట్టి ఏడ్చేసింది. దీంతో ఆమెకు శ్వాస ఆడక ఆసుపత్రిలో చేరింది. అంతలా ప్రేక్షకులకి కనెక్ట్ అయింది అవెంజర్స్ ఎండేగేమ్.

బెంగుళూరు శాంతినికేతన్ థియేటర్ లో అపశృతి చోటు చేసుకొంది. అవెంజర్స్ సినిమా రాత్రి 10గంటల షోలో తొక్కిసలాట చోటుచేసుకొంది. రాత్రి 10 గంటల షో టైమింగ్ ఉండగా.. 9.57 నిమిషాలకు డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో సినిమా మిస్సవుతామనే కంగారులో ఒక్కసారిగా జనం తోసుకుంటూ లోనికి ప్రవేశించారు. ఈ తోపులాటలో ఓ మహిళ క్రింద పోయింది. ఆమె మొహానికి గాయాలయ్యాయి. ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. 46 దేశాల్లో విడుదలైన అవెంజర్స్.. విడుదలైన ప్రతిచోట రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది.