పూరితో కలిసి ఛార్మి.. అక్కడికి చెక్కేసింది !

దర్శకుడు పూరితో హీరోయిన్ ఛార్మి సంబంధం గురించి తెలిసిందే. వీరిద్దరు నిర్మాణ భాగస్వాములుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఎనర్జిట్ రామ్ హీరో. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి (మే1) నుంచి వారనాసిలో మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఛార్మి ఓ వీడియోని షేర్ చేసింది.

కారు ప్రయాణిస్తుండగానే ఛార్మి తీసిన సెల్ఫీ వీడియో. ‘అందికీ హాయ్. ఇప్పడే వారణాసిలోకి అడుగుపెట్టాం. ఇక్కడ ఎండవేడి తీవ్రంగా ఉంది. ఇక్కడ రేపటి నుంచి ఇస్మార్ట్ శంకర్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నాం. సినిమాలో కీలకమైన ఫైట్ సీన్ ఇది. సినిమా చిత్రబృందం అంతా ఇక్కడికి వచ్చిందని తెలిపింది. దర్శకుడు పూరితో హాయ్ కూడా చెప్పించింది’. వారణాసి టూర్ కెళ్లే ఆర్టిస్టులు, సిబ్బంది కోసం ఒక విమానం మొత్తాన్ని బుక్ చేసుకుంది పూరి కనెక్ట్స్.

ఈ చిత్రంలో రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ‘పోకిరి’ సినిమాలో మాదిరిగా ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతుందని చెబుతున్నారు. ఇక, వరుస ప్లాపుల్లో ఉన్న దర్శకుడు పూరి, హీరో రామ్ కి ఈ సినిమా చాలా కీలకం. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని పూరి, రామ్ ఇద్దరు ఆశపడుతున్నారు.