‘మహర్షి’ జ్యూక్ బాక్స్ వచ్చేసింది

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా, ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. సినిమాలో మొత్తం ఆరుపాటలున్నాయి. ఇందులోని ఐదు పాటలని ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసింది. ఆరో పాట ‘ఫిర్ షురు.. ‘ కలిపి మహర్షి ఆల్భమ్ ని విడుదల చేశారు.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహర్షి పాటలని మీరు వినేయండీ.. !