అభిమానుల మెప్పించే కథలనే ఎంచుకొంటా

‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన ప్రతి సినిమా బాహుబలి రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకొంటున్నారు. దీనిపై ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ స్పందించారు. అభిమానుల కోణంలో ఆలోచించి స్క్రిప్టు ఎంచుకుంటానని అన్నారు. ఇంకా ప్రభాస్ ఏమన్నారంటే.. ?

* ప్రేక్షకులు నన్ను ఇంతగా ప్రేమించి, ఆదరించడం నా అదృష్టం. ప్రజలు నా నుంచి చాలా ఆశిస్తున్నారు. నా నుంచి ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ప్రతి ప్రాజెక్టు వారి అంచనాలకు తగ్గట్టు ఉండేలా చూసుకుంటా

* నేను స్క్రిప్టు ఎంచుకునేటప్పుడు.. నా అభిమానులు నన్ను ఎలాంటి పాత్రలో, కథలో చూడాలనుకుంటున్నారని ఆలోచిస్తా. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటా. అదంతా స్క్రిప్టు మీద ఆధారపడి ఉంటుంది. నేను పాత్రలోకి లీనమైపోగలనా, అందులో జీవించగలనా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటానన్నారు

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఆగస్ట్‌ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాహోతో పాటుగా రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా కూడా ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు రానుంది.