#RRRపై భయంకరమైన ప్రచారం.. !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ మల్టీస్టారర్ పై రకరకాల ప్రచారం జరిగింది. ఆ పుకార్లన్నింటీకి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. క్లారిటీ ఇచ్చింది #RRR చిత్రబృందం. ఇక, ఈ సినిమా నుంచి హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం, రామ్ చరణ్ కు గాయాలు కావడంతో.. మరోసారి పుకార్లు మొదలయ్యాయి. చరణ్ కు గాయం కారణంగా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ మూడు వారాలపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇటీవల తారక్ కూడా షూటింగ్ లో గాయపడినట్టు తెలిసిందే. ఆయన కుడిచేతికి కట్టుతో కనబడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ సమయానికి పూర్తికావడం కష్టమే. ముందుగానే ఫిక్స్ చేసిన రిలీజ్ డేటు జులై30, 2019న ఆర్ ఆర్ ఆర్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఇచ్చిన మాట తప్పడం ఖాయమంటున్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ ల కథతో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కుతోంది. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా అలియాభట్ నటిస్తున్నారు. కొమరం భీమ్ తారక్ నటిస్తున్నారు. ఆయన జంటగా హీరోయిన్ ని వెతికే వేటలో జక్కన్న ఉన్నారు. నిత్యామీనన్, శ్రద్దాకపూర్, రస్మిక మందన.. తదితర పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఎవరు ఒకే అవుతారన్నది చూడాలి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.