దేవదాస్ బాకీలు తీరుస్తున్న మహర్షి

మహర్షి విడుదలతో దేవదాస్ బయ్యర్లు ఖుషి అవుతున్నారు. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో నాగ్-నానిల మల్టీస్టారర్ గా ‘దేవదాస్’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘దేవదాస్’ జస్ట్ యావరేజ్ అనిపించుకొన్నాడు. ఐతే, కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయారు కూడా. వారిటి వీలయినంత త్వరగా వడ్డీతో సెటిల్ చేస్తానని అప్పట్లో బయ్యర్లకు లిఖితపూర్వకంగా అగ్రిమెంట్లు చేశాడు నిర్మాత. ఈ నేపథ్యంలో దేవదాస్ బాకీలు తీర్చేదాక ‘మహర్షి’ని విడుదల కానిచ్చేది లేదని బయ్యర్లు పట్టుబట్టి కూర్చొన్నారు.

ఈ నేపథ్యంలో దేవదాస్ బయ్యర్ల బాకీ తీర్చే పనిలో అశ్వినీదత్ ఉన్నట్టు తెలిసింది. అశ్వనీదత్, ఆయన కుమార్తె స్వప్నదత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎవరెవరికయితే బకాయిలు వున్నారో వారందరికీ ఫోన్ లు చేసారు. హైదరాబాద్ రమ్మని కబురు చేసారు. వాళ్లందరూ ఈరోజు రేపు వస్తున్నారని వస్తున్నారు. వారికి అగ్రమెంట్ల ప్రకారం పేమెంట్లు చేస్తారని తెలుస్తోంది.