పోలీసుల కోసం అల్లు అరవింద్.. ఓ మంచి పని !

ఎండలు మండిపోతున్నాయ్. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి మండుటెండల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు విధులు నిర్వహిస్తున్నారు. వారి బాధలని అర్థం చేసుకొన్న నిర్మాత అల్లు అరవింద్.. తనవంతు సాయం చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ నిర్మాణ సంస్థ తరఫున సిటీ మొత్తంలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ సీసాలను సరఫరా చేస్తున్నారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ‘ఈ వేసవిలో వడదెబ్బ వంటివి తగలకుండా రోడ్లపై విధులను నిర్వర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు, జీహెచ్‌ఎంసీ వర్కర్లకు మజ్జిగ సీసాలు అందిస్తున్నాం. మజ్జిగ దాహం తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. యావత్ హైదరాబాద్‌ నగరంలో మేం ఈ మంచి పనిని చేపడుతున్నాం’ అని ట్విట్ చేశారు.

బన్నీ త్రివిక్రమ్ ల సినిమాని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం జెడ్ స్వీడుతో షూటింగ్ జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో చిత్రబృందం ఉంది.