ఆర్టీసీ బస్సులో కాల్పులు.. ఏపీ పోలీసు పనే !

ఈ ఉదయం పంజగుట్ట ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది. బస్సు దిగాల్సిన సమయంలో అడ్డుగా ఇద్దరు ప్రయాణీకులు ఉండటంతో.. సదరు వ్యక్తి గొడవకు దిగాడు. కోపాన్ని ఆపుకోలేని తన వద్ద ఉన్న రివాల్వర్‌తో బస్సులో కాల్పులకు దిగాడు. దీంతో ఆర్టీసీ బస్సు పైకప్పు గుండా బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనపై కండక్టర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. అతడు ఏపీ పోలీస్ శ్రీనివాస్. ఏపీ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నాడు. ఈ విషయమై ఏపీ డీజీపికి కూడ తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారు. ప్రజల మధ్య కాల్పులు జరపడాన్ని ఏపీ డీజీపీ ఠాకూర్ తప్పుబట్టారు. జనాల మధ్య కాల్పులు జరపడం పెద్ద నేరమని ఆయన అభిప్రాయపడ్డారు.