బ్యాన్ పై నిత్యా రియాక్షన్


మలయాళ పరిశ్రమలో హీరోయిన్ నిత్యామీనన్ ని బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిత్యా పెద్ద ఈగోయిస్ట్‌, యాటిట్యూడ్‌ చూపిస్తోంది. ఆమె నటిస్తున్న సినిమా నిర్మాతలని కలవడానికి కూడా ఇష్టపడం లేదు. ఈ నేపథ్యంలోనే నిత్యా బ్యాన్ పై ప్రచారం మొదలైంది. ప్రస్తుతం నిత్యా ‘తత్సమయం ఒరు పెన్‌కుట్టి’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర నిర్మాతలు నిత్యాని కలవడానికి వస్తే.. కలవలేదట. దీంతో ఆగ్రహానికి గురైన సదరు నిర్మాతలు నిత్యాపై బ్యాన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

నిత్యా వర్షన్ మాత్రం మరోలా ఉంది. ‘నిర్మాతలు తనని కలవడానికి వచ్చినప్పుడు మా అమ్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. థర్డ్‌ స్టేజ్‌. షూటింగ్ లో కూడా క్యారవ్యాన్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. అప్పుడే నాకు మైగ్రేన్‌ కూడా అటాక్‌ అయింది. ఆ సమయంలో తాను.. నిర్మాతలని కలిసి మాట్లాడే పరిస్థితుల్లో లేను. నా పరిస్థితి తెలియక తప్పుగా అర్థం చేసుకొన్నారు. ఈగోయిస్ట్‌, యాటిట్యూడ్‌ చూపిస్తున్నానని అనుకొని ఉండొచ్చు. వాటిని అసలు పట్టించుకోను. దానికి బదులు నా వర్క్‌ మీద ఇంకా ఎక్కువ ఫోకస్‌ పెట్టి పనిచేస్తా’నని చెప్పుకొచ్చింది నిత్యా.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఎన్ టీఆర్ జంటగా నిత్యామీనన్ పేరు వినిపిస్తోంది. ఆమెకు రాజమౌళి నుంచి పిలుపొచ్చింది. మేకప్ టెస్ట్ కు కూడా హాజరైందనే వార్తలొచ్చాయ్. ఫైనల్ గా ఆర్ ఆర్ ఆర్ కోసం నిత్యా ఎంపికైందా? లేదా ?? అన్నది త్వరలోనే తెలియనుంది.