హాస్పటల్’లో చేరిన త్రిష.. అసలేమైంది?

హీరోయిన్ త్రిష ఆసుపత్రి పాలైంది. ప్రస్తుతం చికిత్సపొందుతోంది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ త్రిషకు ఏమైందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వీటికి త్రిష తల్లి ఉమాకృష్ణన్‌ సమాధానం ఇచ్చారు. ‘త్రిష చాలా ఆరోగ్యంగా ఉంది. ఆమెకు ఎలాంటి సమస్య లేదు. ‘రాంగీ’ సినిమా షూటింగ్ లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పాల్గొంటోంది. త్రిష అనారోగ్యంపై వస్తున్న వదంతులని నమ్మొద్దు’ అన్నారు.

శరవణ్ దర్శకత్వంలో ‘రాంగీ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథ, మాటలు అందించడం విశేషం. గత యేడాది ’96’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది త్రిష. ఇక, ఈ యేడాది ‘పేట’తో విజయాల ఖాతా తెరిచింది. ‘రాంగీ’పై త్రిష భారీ అంచనాలే పెట్టుకొంది. నయన్, అనుష్కల మాదిరిగా లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవాలని త్రిష ఆరాటపడుతోంది. అందుకే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు అత్యధిక ప్రాధాన్యతని ఇస్తోంది.