కేటీఆర్ ఓ కుర్రకుంక : రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాస్త దూకుడు తగ్గించారు. ఇటీవల జరిగిన తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఐతే, ఆయన మాటల్లో మునుపటి జోరు కనిపించలేదు. తెలంగాణ ఇంటర్ వ్యవహారంలో మాత్రం రేవంత్ దూకుడు పెంచారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంటర్ వ్యవహారంపై గురువారం గాంధీ భవన్‌లో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు 48 గంటల దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడితే ఆయనను ఓ కుర్రకుంక బఫూన్ అంటున్నారని కేటీఆర్ ని ఉద్దేశించి అన్నారు. 20యెళ్లుగా ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్న సంస్థను తప్పించిన కేటీఆర్.. తన స్నేహితుడి సంస్థ గ్లోబరీనాకు టెండర్ ఇప్పించారని ఆరోపించారు.