తెరాస ఎమ్మెల్యేలకు అవమానంపై బాబు హ్యాపీ !


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొంత మంది తెరాస ఎమ్మెల్యేలకి అవమానం జరిగింది. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేలని ప్రజలు అడ్డుకొన్నారు. అభివృద్దిపై నిలదీశారు. వారి ప్రశ్నలకి సమాధానం చెప్పి ముందుకు కదిలనవారు ఉన్నారు. కొన్నిచోట్ల సమాధానం చెప్పలేక వెనుదిరిగిన వారు ఉన్నారు. ఇప్పుడీ విషయాన్ని గుర్తు చేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు హ్యాపీ ఫీలైనట్టు కనబడింది. శనివారం అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో తెదేపా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారు. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి రాలేదని చంకలు గుద్దుకొన్నాడు. అందుకని టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. మరోసారి ఏపీలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నట్టుగా మాట్లాడారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న నమ్మకంతో.. తెరాస తిరిగి అధికారంలోకి వచ్చింది. మరీ.. ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుపై నమ్మకం ఉంచారా.. ? అన్నది తేలాల్సి ఉంది. ఈ నెల 23న ఫలితాలతో ఆ విషయం తెలిసిపోనుంది.