టీడీపీ గెలుపు వరదల్లో వైకాపా, జనసేన గల్లంతు !


విమర్శల్లోనూ ట్రెండు ఫాలో అవుతుంటారు రాజకీయ నాయకులు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ని బాగా వాడేశారు. ‘ఈ ఎన్నికలు నరేంద్రమోడీ ఎండ్ గేమ్’ అంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ట్విట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ఏపీ, ఒడిషాలని అతలాకుతలం చేసిన ‘ఫొని’ తుఫాన్ ని కూడా వాడుకొంటున్నారు నేతలు.

ఏపీలో మరోసారి టీడీపీ గెలుపుపై ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. టిడిపి గెలుపు వరదలో పార్టీలన్నీ గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైకాపా, జనసేనల మధ్యే నెలకొని ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపు వరదలకి వైకాపా, జనసేన కొట్టుకుపోతాయన్నది గోరంట్ల అభిప్రాయంలా కనబడుతోంది. మరీ.. టీడీపీ గెలుపు వరదలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనేది ఈ నెల 23న తెలియనుంది.