ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత పోలింగ్ ప్రారంభం


తొలివిడుత మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. తొలి విడతలో 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.
తొలివిడతలో భాగంగా మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఐతే, వీటిలో 69 ఎంపీటీసీలు, రెండు జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,097 ఎంపీటీసీలు, 195 జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి బారులు తీరారు. వేసవి కావడంతో ఉదయాన్నే ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.