మహేష్’తో రజనీ ఫైట్.. ఫిక్స్ !


ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీసు ఫైట్ రంజుగా ఉంటుంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ల మధ్య ఫైట్ ఇప్పటికే ఫిక్సయింది. వచ్చే యేడాది సంక్రాంత్రి సినిమాల లిస్టులో మహేష్-అనిల్ రావిపూడి సినిమా చేరిపోయింది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాని సంక్రాంత్రి రిలీజ్ లక్ష్యంగా పెట్టుకొన్నారు.

మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘దర్భార్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తొలి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఇందులో రజనీ జంటగా నయనతార నటిస్తోంది. కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేటుని వచ్చే యేడాది సంక్రాంత్రికి ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. దీంతో సూపర్ స్టార్స్ ఫైట్ ఫిక్సయిందని చెప్పవచ్చు.

రజనీ, మహేష్ చిత్రాలతో పాటు బాలకృష్ణ-రవికుమార్, సాయి ధరమ్ తేజ్ – మారుతి సినిమాలు సంక్రాంత్రి రేసులోకి వచ్చే అవకాశాలున్నట్టు సమాచారమ్. ఇవేకాకుండా సడెన్ గా సంక్రాంత్రికి ఫిక్సయ్యే సినిమాలు ఉండొచ్చు. మొత్తానికి.. వచ్చే యేడాది పొంగల్ ఫైట్ రసవత్తరంగా ఉండబోతుందని ఇప్పడే తెలిసిపోయింది.