‘మహర్షి’ థియేటర్స్ వద్ద హంగామా చూశారా.. ?


‘మహర్షి’ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొంటున్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు. మహేష్ నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. సినిమాలో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా నటించారు. భారీ అంచనాల మధ్య మహర్షి ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుధవారం రాత్రి నుంచే ప్రిన్స్ ఫ్యాన్స్ ని మహర్షి డే ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టారు. మహర్షి థియేటర్స్ ని అందంగా ముస్తాబు చేశారు. మహేష్ కటౌట్, బ్యానర్స్ తో నింపేశారు.

కొన్ని చోట్ల బ్యాండ్ భాజాలతో మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ థియేటర్ దగ్గర అభిమానులు చొక్కాలు విప్పేసి.. జై బాబు జైబాబు.. జై మహేష్ బాబు అంటూ నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ఇక, మహర్షి ప్రేక్షకులని అంచనాలని మించేలా ఉందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి కథని నడిపించిన తీరు అద్భుతం. మహేష్ ఎనర్జి, లుక్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ సరదా సన్నివేశాలు. ఎమోషన్స్ తో సాగింది. సెకాంఢాఫ్ లో మహేష్ ప్రపంచాన్ని ఏలేయడం చూడొచ్చు. రైతుగా మహేష్ నటన పీక్స్ అంటున్నారు.