జగ్గారెడ్డి జంప్.. త్వరలో !

కరుడు గట్టిన కేసీఆర్ వ్యతిరేకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆయన కూడా తెరాసలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గురువారం జగ్గారెడ్డి స్పందించారు. తనని కేసీఆర్, కేటీఆర్ బంధువులు కలిసి తెరాసలోకి ఆహ్వానించారు. వారికి ఈ నెల 25 నుంచి 30లోగా నిర్ణయాన్ని తెలుపుతానని చెప్పాను.

ఈ నేపథ్యంలో తాను గాంధీ భవన్ లో ఉంటానో.. తెరాస భవన్ లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందన్నారు జగ్గారెడ్డి. తాను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ చెప్పింది సగమే వింటా. మిగతా సగమంతా తన నిర్ణయాలే ఉంటాయి. స్వశక్తిగా ఎదిగాను. పార్టీ బ్యానర్‌పై గెలిచిన నేతను కానని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. పరోక్షంగా జగ్గారెడ్డి చెప్పేదేంటంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ టికెట్ కన్నా.. సొంత ఇమేజ్ తో గెలిచినాని చెప్పడమే. ఆ మాటలకి ఆంతర్యం.. తాను త్వరలోనే కారెక్కబోతున్నాని క్లారిటీ ఇవ్వడమే.