నైజాంలో బాహుబలి రికార్డ్ బ్రేక్

‘మహర్షి’ రికార్డులకి తెరలేపాడు. మహర్షి ప్రీమియర్ కలెక్షన్స్ ఏకంగా బాహుబలి రికార్డుని బ్రేక్ చేస్తాయని భావించారు. ప్రీమియర్ కలెక్షన్స్ ద్వారా 2మిలియన్ డాలర్లు వస్తాయని ఆశించారు. కానీ, అలా జరగలేదు. కేవలం ఆఫ్ మిలియన్ తో సరిపెట్టుకొన్నాడు మహర్షి. ఇది మహేష్ అభిమానులని నిరాశపరిచే అంశమే. ఐతే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మహర్షి ఏమాత్రం నిరాశపరచలేదు.

నైజాంలో మహర్షి ఫస్ట్ డే వసూళ్లలో బాహుబలి రికార్డుని బ్రేక్ చేశాడు. నైజాంలో మాహర్షి రూ.6.38 కోట్ల వసూలు చేశాడు.
‘బాహుబలి2’ నైజాంలో రూ.8.95 కోట్లు వసూలు చేయగా, ‘బాహుబలి1’ రూ.6.26 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో నైజాంలో మహర్షి బాహుబలి రికార్డుని బ్రేక్ చేసినట్టు అయింది. బాహుబలి 2ని మాత్రం టచ్ చేయలేకపోయాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ తెరకెక్కింది. మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడి పాత్రలో నటించారు. దర్శకుడు వంశీ కథని డీల్ చేసిన విధానంపై ప్రశంసలు కురుస్తున్నాయ్. మహేష్ వన్ మేన్ షో చేశారు. కథని మలుపుతిప్పే పాత్రలో అలరోడు ఒదిగిపోయాడు. పూజా గ్లామర్ షో, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి.