రెజీనా సస్పెన్స్ లో పెట్టిందిగా.. !!

హీరోయిన్ రెజీనా ప్రేక్షకులని సస్పెన్స్ లో పెట్టేసింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘సెవెన్’. ఈ చిత్రానికి కెమెరామేన్ నైజర్ షఫీ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. హవీష్, రహ్మాన్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న సెవెన్ ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ ని కట్ చేశారు. అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసే ఓ యువకుడు చుట్టూ కథ తిరుగుతోందని ట్రైలర్ తో అర్థమవుతోంది. ఐతే.. ట్రైలర్ చివరలో హీరో జీవితంలో జరిగిన మిగితా కథ ఏంటో చెప్పమంటావా.. ? అంటూ పోలీస్ అధికారి అనగా.. హుష్.. వద్దు అన్నట్టు రెజీనా సైగ చేసి సస్పెన్స్ లో పెట్టేసింది. జూన్ 5న థియేటర్స్ లో సస్పెన్స్ విప్పుతామని కనుసైగ చేసింది.