కర్నూలు రోడ్డు ప్రమాదం : మృతుల వివరాలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు గద్వాల వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాను వాహనంలో ఉన్న 15 మంది మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలోనే 13 మంది మృతిచెందగా.. చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గుంతకల్లులో వివాహ నిశ్చితార్థ వేడుక ముగించుకొని తుఫాను వాహనంలో వస్తున్న 15 మంది మృత్యువాత పడ్డారు. వెల్దుర్తికి చెందిన ద్విచక్రవాహనదారుడు మృతిచెందారు.

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి :

* వెంకట్రాముడు (30)

* గోపీనాథ్ (25)

* రాముడు (45)

* మునిస్వామి(30)

* భాస్కర్(30)

* సోమన్న(40)

* తిక్కన(40)

* సాలన్న(30)

* నాగరాజు(25)

* పరుశు రాముడు(28)

* సురేష్(30)

* విజయ్(35)

* పగులన్న(45)

* చింతలన్న(55)

వీరితో పాటు వెల్దుర్తికి చెందిన మాసుం (35) ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.