ఓటేసిన విరాట్ !


సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో మొత్తంలో 59 నియోజకవర్గాలకు గానూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా కేప్టెన్‌ విరాట్‌ కొహ్లీ హరియాణా గుడ్‌గావ్‌లోని పైన్‌క్రెస్ట్‌ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాజీ క్రికెటర్‌, ఢిల్లీ తూర్పు భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఆయన సతీమణితో కలిసి ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఈయనకు పోటీగా ఆప్‌ తరఫున అతిషీ, కాంగ్రెస్ నుంచి అర్విందర్‌ సింగ్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆయన సతీమణి సీమాతో కలిసి పాండవ్‌ నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.