హర్మన్‌ప్రీత్‌ సేనదే టీ20 సిరీస్

ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌ విజేతగా హర్మన్‌ప్రీత్‌ సేన నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన మిథాలీ నేతృత్వంలోని వెలాసిటీ నిర్ణీత 20ఓవర్లో 121 పరుగులు చేసింది. సుష్మా వర్మ (40*; 32 బంతుల్లో 3×4, 1×6), అమెలీ కెర్‌ (36; 38 బంతుల్లో 4×4) అద్భుతంగా ఆడారు. వెలాసిటీ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించింది. హర్మన్‌ (51; 37 బంతుల్లో 4×4, 3×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది.

సూపర్‌నోవాస్‌ ఇన్నింగ్స్ లో హర్మన్‌ (51; 37 బంతుల్లో 4×4, 3×6) హైలైట్. జట్టు కష్టాల్లో ఉన్నా.. హర్మన్‌ పట్టువదల్లేదు. తొలుత ఆచితూచి ఆడింది. చెత్త బౌలింగ్‌ను వేటాడి భారీ సిక్సర్లు బాది రన్‌రేట్‌ తగ్గించింది. చివరి ఓవర్‌లో విజయం సాధించాలంటే 7 పరుగుల అవసరం. అమెలీ కేర్‌ వేసిన రెండో బంతికి ఆమె ఔట్‌ కావడంతో ఉత్కంఠ మొదలైంది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్‌ వరుసగా మూడు బంతుల్లో డబుల్స్‌ తీసి విజయం లాంఛనం చేసింది.