శతృఘ్న సిన్హా కాంగ్రెస్ లో చేరడం వెనక అడ్వానీ హస్తం !


భాజాపా అగ్రనేత ఎల్ కె అడ్వానీకి ప్రస్తుతం పార్టీలో పెద్ద ప్రాధాన్యత, గౌరవం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దీంతో ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఏకంగా పార్టీని వీడుతున్నారు. అలా పార్టీని వీడిన నేతల్లో శతృఘ్న సిన్హా ఒకరు. ఇటీవలే శతృఘ్న సిన్హా కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ తరుపున పట్నా సాహిబ్‌ స్థానం నుంచి బరిలోకి దిగారు.

ఎనికల ప్రచారంలో భాగంగా శతృఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి భాజాపా అగ్రనేత అడ్వానీ ఆశీస్సులు ఉన్నాయి. ‘నేను వేరే మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అడ్వాణీ దగ్గరికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. అప్పుడు ఆయన కంట్లో నీరు చూశాను. కానీ ఆయన నన్ను వెళ్లొద్దని మాత్రం అనలేదు. ఒకే.. ఐ లవ్‌ యూ అని ఆశీర్వదించారు’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో శతృఘ్న సిన్హా పార్టీ మారడం వెనక అడ్వానీ హస్తం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.