తిరుమలలో తప్పిన పెను ప్రమాదం


తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే కనుమ రహదారిలో మంగళవారం మధ్యాహ్నం బస్సు ప్రమాదం జరిగింది. వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. లోయ వైపు దూసుకెళ్లింది.
చెట్టుకొమ్మలు, వృక్షాలు అడ్డుగా ఉండటంతో బస్సు రహదారి పిట్టగోడపై నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు కాస్త ముందుకు వెళ్లి ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగేది.